ఈ మూడు కాళ్ల కుర్చీ పడిపోతుంది.. ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్

by Disha Web Desk 5 |
ఈ మూడు కాళ్ల కుర్చీ పడిపోతుంది.. ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ఎన్నికల్లో పొత్తులపై వైసీపీ రీజనల్ కోఆర్టినేటర్, ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల గురించి ఆయన చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. "టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరినా, 2014-19 మధ్య ఏపీ చూసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. ఇది వేరొక ప్యాకేజీతో ఏర్పాటైన పోత్తు అని, ఈ 3 కాళ్ళతో ఏర్పాటైన కుర్చీ పడిపోతుందని, అందుకే సుస్థిర ప్రభుత్వానికి ఓటు వేయాలని, వైసీపీకి ఓటు వేయాలి" అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పొత్తులపై విజయ సాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఇప్పటికే అధికార వైసీపీ ఒక వైపు, ఏపీలో మిగిలిన పార్టీలన్ని ఒకవైపు అన్నట్లుగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే పొత్తులపై టీడీపీ, జనసేన, బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇన్ని రోజులు బీజేపీపై ఎక్కువగా కామెంట్లు చేయని వైసీపీ నేతలు ఈ రోజు నుంచి రెచ్చిపోతారనే ప్రచారం పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. మరి దీనిపై పొత్తు పార్టీల నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.




Next Story

Most Viewed